• Breaking News

    తెలుగు సినిమాతో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ ఎంట్రీ.....!

     ఈ మధ్య టైం లో చూస్కుంటే మరో టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ బాలీవుడ్‌లో రీమేక్ కాబోతుంది. 


    టాలీవుడ్ లో దుమ్ము లేపుతున్న సినిమాలు బాలీవుడ్‌కు వెళ్లేసరికి ఎందుకు తోక ముడుస్తున్నాయి..? సమస్య మన కథల్లో ఉందా లేదంటే వాళ్లు తీసే విధానంలో ఉందా..?

     
    అది కూడా మామూలు కథ కాదు.. రిస్కీ కథే. మరింతకీ ఏంటా సినిమా..? అదైనా అక్కడ వర్కవుట్ అవుతుందా.? తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తుంటాయి.

    అప్పట్లో శివ.. ఆ సినిమా చిత్రం.. మొన్నామధ్య అర్జున్ రెడ్డి.. మూడేళ్ళ కింద ఉప్పెన.. లాస్ట్ ఇయర్ బేబీ.. ఈ మధ్యే హనుమాన్..! రిలీజ్‌కి ముందు ఏ సందడి ఉండదు.. 

    ఖుషీ కపూర్‌
    కానీ అవి వచ్చాక చేసే సందడి ఫుల్ గా ఉంటుందివైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 100 కోట్లకు పైగా సేకరణ చేసింది. 


    2021లో కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలో ఇండస్ట్రీని నిలబెట్టిన సినిమా ఇది.ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు.


    ఈ సినిమాతో శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్‌ను బాలీవుడ్ లో పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఉప్పెన రీమేక్‌కు హీరో, దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 


    అలాగే బేబీ కూడా హిందీలో రీమేక్ అవుతుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ 90 కోట్లకు పైగా సేకరణ చేసింది.


     బాలీవుడ్ లో దీనికి కల్ట్‌ బొమ్మ అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేసారు ఈ మధ్య తెలుగు రీమేక్స్‌ హిందీలో వర్కవుట్ అవ్వట్లేదు. జెర్సీ, అల వైకుంఠపురములో, హిట్ లాంటి సినిమాలు మన దగ్గర బాగానే ఆడినా.. బాలీవుడ్‌లో పతనంయ్యాయి.


    అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఒక్కటే ఈ మధ్య హిట్టైన తెలుగు రీమేక్. 


     ఉప్పెన రీమేక్స్ నిలుస్తాయా..? ఏదేమైనా నార్త్ ఆడియన్స్‌కు నచ్చేలా ఈ రీమేక్స్ రూపొందించడం పెద్ద టాస్కే.


    No comments