• Breaking News

    త్రిష డబ్బులు కోసం చి,చి అంత పని చేసిందా...

     త్రిష 1983 మే 4న  తమిళనాడులోని చెన్నై లో  పుట్టింది. త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. 

    అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.


    ఆమె మొదటిగా వర్షం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది.తరువాత ఈమె నమో వెంకటేశ, నీ మనసు నాకు తెలుసు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, బుజ్జిగాడు,ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే తదితర సినిమాల్లో నటించింది.


     ఈమె ను క్వీన్ ఆఫ్ ది సౌత్’ అని ముద్దుగా అభిమానులు పిలుచుకుంటారు.ఈమె ఇప్పటిదాకా ఒకేఒక్క హిందీ సినిమాలో నటించింది.


     త్రిష మరోసారి తనకు సంబంధం లేని వివాదంలో చిక్కుకొన్నారు. ఆమెను ఉద్దేశించి అన్నాడీఎంకే నాయకుడు ఏవీ రాజు మీడియాతో మాట్లాడుతూ దారుణమైన వ్యాఖ్యలు చేయడం భారీ వివాదంగా మారింది.



    అన్నాడీఎంకే నాయకుడు ఏవీ రాజుమాట్లాడుతూ   సలెం పశ్చిమ ఎమ్మెల్యే జీ వెంకటాచలంపై ఆరోపణలు చేస్తూ,త్రిషకు 25 లక్షల డబ్బులు ఇచ్చి రిసార్టుకు తెచ్చుకొన్నారు అని తన వీడియో ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనంగా మారింది.



    ఈ విషయం తమిళనాడు మీడియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసింది.ఏవీ రాజు వివాదాస్పద వ్యాఖ్యలపై త్రిషా కృష్ణన్ తీవ్రంగా ఖండించింది. నీతిమాలిన రాజకీయ నేత అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.


    పబ్లిసిటీ కోసం కొంతమంది ఎంతకు దిగజారుతారో అనే దానికి ఇది పరాకాష్టం. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం అత్యంత దారుణం. తనపై అవాస్తవాలను ప్రచారం చేసిన ఈ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాం. నా లీగల్ టీమ్ తదుపరి యాక్షన్ తీసుకొనేందుకు సిద్దమైంది అని త్రిష ట్వీట్ చేసింది.


    అన్నా డీఎంకే నేత ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ఊరికే వదిలిపెట్టకూడదు,వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని అభిమానులు డిమాండ్ చేశారు. త్రిషాకు అండగా ఉంటామని వారు ట్వీట్స్ పోస్టు చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు.


    No comments